బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మళ్లీ అధికారం అప్పగిస్తే దాయాది దేశానికి తగిన బుద్ది చెబుతామన్నారు. పాకిస్తాన్ తీరు మారకపోతే సెప్టెంబర్లోపు దాని అంతు చూస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రజా తీర్పు అభివృద్ధికి అయితే ఈ సారి పాక్ అంతు చూసేందుకు అన్నారు. భారత్ తలుచుకుంటే పాక్ నామారూపాలు లేకుండా చేయగలదన్నారు.