జగన్‌పై కావాలని దాడి చేయలేదు : శ్రీనివాస్

Update: 2019-05-25 11:59 GMT

తన కుటుంబం మొత్తం జగన్ అభిమానులమని, టీడీపీకి చెందిన వాళ్లం కాదని స్పష్టం చేశాడు కోడికత్తి శ్రీనివాస్. వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. స్వగ్రామం తానేలంక చేరుకున్న శ్రీనివాస్ తాను కావాలని దాడి చేయలేదని, యాదృచ్చికంగా జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో జగన్ తనను వదిలేయమని చెప్పారని, అలాంటి మంచి మనస్సున్న వ్యక్తి జగన్ అని చెప్పారు. ఆయన రాష్ట్ర ప్రజలకు అభీష్టం మేరకు జీవితాంతం సీఎంగా కొనసాగుతారని చెప్పాడు కోడికత్తె శ్రీనివాస్.   

Similar News