మంత్రి జగదీష్‌ రెడ్డి కారును అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ... రాజీనామా చేయాలని...

Update: 2019-04-25 09:47 GMT

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ని విద్యార్థి సంఘం అడ్డుకుంది. ఇంటర్‌ బోర్డులో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యకార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంత్రి కారును అడ్డుకున్నారు. బాధిత విద్యార్థులకు ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా రీ వాల్యుయేషన్‌ చేయించాలని కోరారు. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుతగిలిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. 

Similar News