అందుకే హత్యలు చేశా.. విచారణలో శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2019-05-14 02:29 GMT

శ్రీనివాస్‌రెడ్డి ఆ పేరు వింటే చాలు హాజీపూర్‌ వణికిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా హీజీపూర్ హత్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. కేవలం ఒంటరి మహిళలను టర్గెట్‌గా సమయం చూసి పంజా విసిరే వాడు కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి. హాజీపూర్‌లో వరుస హత్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్ రెడ్డి అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీనివాస్ రెడ్డి అఘాయిత్యాలను ‎ఒక్కోఒక్కోటిగా బయటకు లాగుతున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఈ హత్యలు ఎందుకు పాల్పడ్డావని పోలీసులు అడిగితే దానికి శ్రీనివాస్ రెడ్గి సమాధానం ఇస్తూ ఆ సమయంలో అలా అనిపించింది.. అందుకే చంపేశా అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

జులాయిగా తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేసిన శ్రీనివాస్‌రెడ్డి ఇక అమ్మాయిలు కనబడితే మృగంలా మారిపోతాడని.. వారిని అనుభవించాలనే పిచ్చితో రగిలిపోతాడని పోలీసుల విచారణలో తేలింది. హాజీపూర్ చుట్టుపక్క ప్రాంతాలతో పాటు.. మహబూబ్ నగర్, భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో ఆరేళ్లుగా నమోదైన మిస్సింగ్ కేసులపై ఆరా తీశారు. కనీసం 30 మంది కంప్లైంట్లపై కూడా పోలీసులు దృష్టి సారించారు. 

Similar News