మాజీ ఎంపీ సబ్బం హరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. భీమిలి టీడీపీ శాసనసభ అభ్యర్థిగా సబ్బంహరిని ప్రకటించడంతో ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తనకు విశాఖ ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరడంతో త్వరలో మరోసారి భేటి అయ్యి చర్చిద్దామని సబ్బం హరికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. భీమిలిలో వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్తో సబ్బంహరి తలపడనున్నారు.