ఎన్నికల్లో ఏదో జరిగింది: ఉత్తమ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? అని ఉత్తంకుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఏదో జరిగిందన్న అనుమానం కలుగుతుందని ఉత్తం ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? అని ఉత్తంకుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఏదో జరిగిందన్న అనుమానం కలుగుతుందని ఉత్తం ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ డిమాండ్ చేశారు. బిసీ రిజర్వేషన్లపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఉత్తమ్. రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎందుకు కొనసాగించలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. బీసీలలో వర్గీకరణ చేయాలని మాత్రమే దాసోజు శ్రవణ్ కోర్టులో కేసు వేశారని ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు.