చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు ప్రాణాలు కోల్పాయారు. పలువురికి గాయాలయ్యాయి. రేణిగుంట మండలం గురవరాజుపల్లి దగ్గర నిలిచి ఉన్న లారీని జైలో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరంకు చెందిన వారిగా గుర్తించారు. కుటుంబ సభ్యులంతా కలిసి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రేణిగుంట అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.