ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలై థియేటర్లలో దూమ్మురేపుతున్న నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో వేడి పుట్టించిన రాంగోపాల్ వర్మ చాలా ఏండ్ల గ్యాప్ తరువాత భారీ విజయాన్ని అందుకున్నాడు అనే చెప్పవచ్చు. కాగా మూవీ సక్సెస్ సాధించడంతో ఆర్జీవీ అభిమానులు ఉర్రుతులుగుతున్నారు. ఇక హిట్ కొట్టడంతో మంచీ ఫామ్లోకి వచ్చిన రామ్ గోపాల్ వర్మ. గతంలో శశికళపై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ తాజాగా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ను కూడా విడుదల చేశాడు. దినికి సంబంధించి ట్విట్టర్లో ఆ పోస్టర్ను ట్వీట్ చేశాడు. తమిళ నాట సంచలనం సృష్టించిన జయలలిత మరణం, అటుపై శశికళ ఉదంతాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమా పేరును 'శశికళ' అని వర్మ ప్రకటించాడు. శశికళకు జైలు శిక్ష, మన్నార్గుడి మాఫియాలను హైలెట్ చేస్తూ ఈ చిత్రం వస్తుందని టాక్. కొద్దిసేపటి క్రితమే ట్వీట్టర్ లో అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మ త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ తెలిపారు.