తెలంగాణలో మరోసారి ఎన్నికల యుద్ధన్ని తలపిస్తోంది. ఒకరిపై మరోకరు మాటల తూటలతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటివలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఒడిపోయిన విషయం తెలిసిందే కాగా మరోసారి ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ సారి మల్కాజ్గిరి నుండి ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కాగా మాటల తూటలతో మరోసారి రెచ్చిపోతున్నాడు రేవంత్. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టర్గెట్గా సవాల్ విసురుతున్నారు. కేసీఆర్కు దమ్ముంటే మల్కాజ్గిరిలో తనపై పోటీ చేయాలని రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరారు. అయితే తనపై పోటీకి రియల్టర్లు, బ్రోకర్లను అభ్యర్థులుగా దించుతున్నారని వాళ్లు ఎవరు వద్దు కానీ కేసీఆరే ఎన్నికల బరిలో దిగాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులేదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై పోరాడే దమ్ముందన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని ఎల్బీనగర్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ అన్నారు.