నియంత పాలన ఎలా ఉంటుందో కేసీఆర్ చూపిస్తున్నారని రెండోసారి అధికారంలోకి వచ్చాక రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ బరిలో తానుండాలని కోరుకున్న కాంగ్రెస్ నాయకులంతా ప్రస్తుతం కేసీఆర్ పక్కన ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను గొడ్డుల్లా భావిస్తూ పక్క పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ దావూద్ ఇబ్రహీంలా తయారయ్యారని మండిపడ్డారు.