ఆ పార్టీల నేతలు దాదాపు 12 క్వింటాళ్ల లడ్డూలు ఆర్డర్ చేశారట..

Update: 2019-05-22 12:57 GMT

లోక్‌సభ ఫలితాలు వెలువడేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్నవారు విజయోత్సవాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాణాసంచా తెచ్చుకోవడంతో పాటు, స్వీట్లకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నారు. పంజాబ్‌లో అయితే వివిధ రాజకీయ పార్టీల నాయకులు 10 నుంచి 12 క్వింటాళ్ల లడ్డూలు ఆర్డర్ చేశారు. వీరిలో బీజేపీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో నేతలు ఉన్నారని దీంతో తమకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇస్తున్నారని దుకాణదారులు అంటున్నారు.

Similar News