భోపాల్ లోక్సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై కేసు నమోదైంది. ముంబై మాజీ ఏటీసీ చీఫ్ స్వర్గీయ హేమంత్ కర్కరేపై సాధ్వీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు దేంవేంద్ర సింగ్ యాదవ్ ఇండోర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేంవేంద్ర సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో అరెస్టయిన తర్వాత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరు మొదటిసారిగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు. తగినన్ని సాక్ష్యాధారాలు లేవని ఎన్ఐఏ కోర్టు ప్రకటించడంతో గత ఏడాదే విడుదలయిన విషయం తెలిసిందే.