ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన ఎంఐఎం

Update: 2019-02-25 11:15 GMT

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిపై మజ్లిస్ పార్టీ మొత్తానికి ఎవరు అనే ఉత్కంఠకు తెర దించింది. మీర్జా రియాజ్ ఉల్ హసన్‌ను పేరును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. కాగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ డబీర్ పురా కార్పోరేటర్‌గా కొనసాగుతున్నారు. వచ్చే నెల 12న ఎమ్మెల్యేకోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించబడనుంది. కాగా ఇప్పటికే అధికార పార్టీ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. కాగా పార్టీ ప్రకటించిన వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం కురుమ, శేరి సుభాష్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News