జగన్ దైర్యం ఎక్కువగా ఉన్న మనిషి : నిఖిల్ కుమారస్వామి

Update: 2019-06-11 13:48 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కర్ణాటక ముఖ్యమంత్రి కొడుకు నిఖిల్ కుమారస్వామి భేటి అయ్యారు .. దీనికి సంబందించిన ఫొటోస్ ని అయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు . జగన్ మోహన్ కు ధైర్యం ఎక్కువ అని నిఖిల్ కుమారస్వామి కితాబు ఇచ్చారు. కర్ణాటక రాజకీయలపై జగన్ మోహన్ రెడ్డికి ఎక్కువ అవగాహన ఉందని, అక్కడి రాజకీయల గురించి అడిగి తెలుసుకున్నారని నిఖిల్ కుమార్ స్వామి తెలిపారు.

జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం నిజంగా చాల సంతోషంగా ఉందని నిఖిల్ కుమారస్వామి తెలిపారు.అనేక మంది రాజకీయ నాయకులకు జగన్ మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిస్తున్నారని నిఖిల్ కుమారస్వామి తెలిపారు.జగన్ రాజకీయాల్లో మరింత ఎదగాలని అయన కోరారు ..  



Tags:    

Similar News