దేశరాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసాలకు హైదరాబాద్కు చెందిన యువకులు ప్లాన్ చేసినట్టు తేలింది. ఢిల్లీలో నలుగురు యువకులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఆర్ఎస్ఎస్ నాయకుడిని హత్య చేసేందుకు హైదరాబాద్కు చెందిన బాసిత్, మరో నలుగురు ఢిల్లీ వెళ్లినట్టు తేలింది. ఉగ్రదాడి చేసేందుకు కెమికల్స్, డబ్బులను యువకులు సమకూర్చుకున్నారు. వారికి ఐఎస్ఐఎస్ ఏకే 47ను సమకూర్చింది. అయితే, ప్లాన్ అమలుకాకపోవడంతో హైదరాబాద్ తిరగొచ్చారని నిర్ధారణ అయ్యింది.