చుక్కేసి చిక్కిన మందుబాబులకు.. కోర్టు కిక్కు
డిసెంబర్ 31 అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ మందుబాబులకు కోర్టు షాకిచ్చింది.
డిసెంబర్ 31 అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ మందుబాబులకు కోర్టు షాకిచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 405మందికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. మాదాపూర్లో 147మందికి, గచ్చిబౌలిలో 72మందికి, మియాపూర్లో 56మందికి, కూకట్పల్లిలో 79మందికి, బాలానగర్లో 51మందికి జైలుశిక్ష పడింది. నేరం తీవ్రతను బట్టి పట్టుబడ్డ మందుబాబులకు మూడ్రోజుల నుంచి 25రోజుల వరకు జైలుశిక్ష విధించింది. జైలుశిక్ష పడ్డవాళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేనివాళ్లకు ఐదు వందలు, మద్యం సేవించినవారికి వాహనం ఇచ్చినందుకు 5వేలు,మైనర్ డ్రైవర్స్కి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించింది.