టీడీపీకి మరో షాక్...కూతురుతో కలిసి జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి

Update: 2019-03-21 01:56 GMT

కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీని వీడి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. కుమార్తె సుజలతో కలిసి పవన్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఆయన టీడీపీ గూటికి చేరుకున్నారు. తనకు మరోసారి ఎంపీ సీటు ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరినా నిరాకరించడంతో టీడీపీని వీడినట్టు ఆయన ప్రకటించారు. నంద్యాల పార్లమెంట్ నుంచి తాను అసెంబ్లీ నుంచి తన అల్లుడు పోటీ చేస్తారని ఎస్పీవై రెడ్డి ప్రకటించారు. 2004 నుంచి వరుసగా మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికైన ఎస్పీవై రెడ్డి పార్టీని వీడటం జిల్లాలో సంచలనంగా మారింది.

Similar News