వీధుల్లో ఇడ్లీ అమ్మే ఓ వ్యాపారి చట్నీ తయారీకి మరుగుదొడ్డిలోని నీటిని వాడాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వేస్టేషను వద్ద టిఫిన్ సెంటరు నడుపుతున్న ఓ వ్యాపారి ఇడ్లీతో పాటు చట్నీ తయారు చేసేందుకు రైల్వేస్టేషనులోని మరుగుదొడ్డి నీటిని వినియోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి శైలేష్ స్పందించి దీనిపై విచారణ జరిపారు. ప్రజలంతా కలుషిత నీటితో తయారు చేసే ఆహారపదార్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 'ఆ వీడియో మా దృష్టికి రావడం జరిగింది. ఆ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం. కలుషిత నీటిని ఉపయోగించే అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ నీరు ఆరోగ్యానికి మంచివి కావు. సదరు వ్యక్తిని పట్టుకుని అతని లైసెన్స్ను తనిఖీ చేస్తాం, ఎలాంటి సాంపిల్ దొరికినా సీజ్ చేస్తాం'అని ముంబై ఎఫ్డీఏ అధికారి శైలేష్ అదావ్ మీడియాకు తెలిపారు
@DisasterMgmtBMC @WesternRly @MumbaiPolice viral video of how hawkers use toilet water for feeding us outside borivali west station. pic.twitter.com/aFzI8jR6ob
— mili shetty (@saimili) May 31, 2019