వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడితో పాటు అందుకు సహకరించిన అతడి తల్లిపై నాచారం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం కాప్రా ఈసీఐఎల్కు చెందిన యువతి(18) స్థానిక జూనియర్ కాలేజీలో రిసెప్షన్గా పని చేస్తోంది. ఆ యువతికి నాచారం హెచ్ఎంటినగర్కు చెందిన అబ్దుల్ మజీద్తో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఇక ఇదే క్రమంలో తనను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి పలుమార్లు నేరుగా తన ఇంటికి తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని యువతి గట్టిగ నిలదీయడంతో అందుకు అబ్దుల్ మజీద్ ఒప్పుకోలేదు అంతే కాకుండా తన వద్ద ఉన్న వీడియోలను నేరుగా ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
అయితే అందుకు అబ్దుల్ మజీద్ తల్లి సలేహా సహీన్(45) కూడా సహకరించినట్లు బాధితురాలు తెలిపింది. అంతేకాకుండా తన వద్ద నుంచి రూ. 60 వేలు నగదు, 7.5 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు అబ్దుల్ మజీద్, సలేహా సహీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి 36 గ్రాముల బంగారం, బైక్, కారు, సెల్ఫోన్ జప్తు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.