రానున్న లోకసభ ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ స్థానం నుండి పోటీచేస్తారో అని నిన్నటి వరకు అందరి లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి మోడీ ఎక్కడి నుండి పోటీచేస్తారన్న ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. గత లోక్సభ ఎన్నికల్లో 5,81,022 5,81,022 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ ధఫా కూడా వారాణాసి నుంచే ఎన్నికల బరిలో దిగుతారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు శనివారం ఆపార్టీ పార్లమెంటరీ కమిటీ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాని మోడీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశంపై చర్చజరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మోదీతో సహా, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.