టీఆర్ఎస్లో చేరేందుకు తానేమీ ప్రయత్నించడం లేదన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి . కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టులాందన్నారు. పార్టీ మార్పుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించినా ఉపయోగం లేకుండా పోతుందని మీడియా చిట్చాట్లో తెలిపారు. పార్టీలో ఉంటానా టీఆర్ఎఎస్లోకి వెళ్తానో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు ఎందుకు మారారో అర్ధం కావడం లేదన్నారు. తమపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నరని తీవ్రస్థాయిలో విమర్శించారు జగ్గారెడ్డి. తాజాగా జగ్గారెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో జగ్గారెడ్డి స్పందించారు.