లోటస్ పాండ్ బీజేపీకి బ్రాంచ్ ఆఫీసుగా మారిపోయింది: మంత్రి కాల్వ

Update: 2019-02-01 05:48 GMT

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. అసలు మీరు వైసీపీ తరఫున మాట్లాడుతున్నారా? లేక బీజేపీ తరఫున మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ మోడీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ సమస్యలపై జగన్ ప్రధానిని పన్నెత్తు మాట అనడం లేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. లోటస్ పాండ్ బీజేపీ బ్రాంచ్ ఆఫీసులగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 

Similar News