జగన్ ఆడుతున్న జగన్నాటకంలో భాగంగానే రోజుకో వ్యక్తి బయటికి వస్తున్నారని మంత్రి దేవినేని సెటైర్లు వేశారు. జగన్, కేసీఆర్ కనుసన్నల్లోనే వైసీపీలోకి ఫిరాయింపులు జరుగుతున్నాయని దేవినేని ఆరోపించారు. అవంతి, ఆమంచి, దాసరి జైరమేష్ వెనుక ఎవరున్నారో ప్రజలు గమనించాలన్న దేవినేని ఎంతమంది పార్టీలు మారినా జనం ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు.