నల్గొండ జిల్లాలో ఘోరం.. తండ్రి కోసం తల్లడిల్లిన కుమార్తె

Update: 2019-05-31 11:49 GMT

కూతురి కళ్లముందే తండ్రి విగతజీవిగా పడిఉన్న సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. కామినేని ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా చర్లపల్లి జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి తల నుజ్జునుజ్జు కాగా మరొరకు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు నర్సింహ, శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. ఇక తండ్రి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుమార్తె తల్లడిల్లిపోయింది. నాన్న లే అంటూ బిగ్గరగా ఏడుస్తున్న దృశ్యాలు చుట్టుపక్కల వారిని కంట తడి పెట్టించాయి.

Full View 

Similar News