కోల్కతాలో జరుగుతున్న ఐక్యతా ర్యాలీకి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ హాజరయ్యాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ బహిరంగసభలో విపక్ష పార్టీలకు చెందిన పలువురు జాతీయ నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో లోక్తాంత్రిక్ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన సంక్షోభం ఉందన్నారు. రైతులు తీవ్రమైన నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 7 కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను బీజేపీ తన గుప్పిట పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గంగలో నిమజ్జనం చేయాలిని చెప్పారు. మరో రాజకీయ విప్లవానికి కోల్కతా నాంది పలికిందన్నారు. బీజేపీ అవినీతికి రఫేల్ కుంభకోణం ఒక నిదర్శనం అని శరద్ యాదవ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో పాటు తదితరులు ర్యాలీకి హాజరయ్యారు.