అమిత్ షా పర్యటనకు దీదీ బ్రేక్..

Update: 2019-05-13 08:23 GMT

పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ బీజేపీల మధ్య మరో వివాదం చెలరేగింది. చివరి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటనకు వస్తున్న అమిత్‌‌షాకు దీదీ బ్రేకులు వేశారు. అమిత్‌షా పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతించలేదు. దీంతో జాదవ్‌పూర్‌లో అమిత్‌‌షా రోడ్‌ షో రద్దయ్యింది. మమతా బెనర్జీ నిర్ణయంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై ఈసీ మౌనంగా ఉండటం ఎంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. 

Similar News