వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు.. దీంతో ఆ ప్రేమ జంట..

Update: 2019-05-21 06:31 GMT

ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఓ ప్రేమ జంట. కడప జిల్లా వల్లూరు మండలం గంగయ్యపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. అనంతపురం పట్టణ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ అదే పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించక పోవడంతో పాటు మరో యువతితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ తన ప్రియురాలితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News