సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

Update: 2019-03-10 11:30 GMT

గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నసార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా తొమ్మిది విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర నేటి సాయంత్రం మీడియా సమావేశం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. లోక్ సభ 543 స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీ 175, ఒడిసా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

Similar News