ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్‌ కాదు: కుమారస్వామి

Update: 2019-05-20 12:11 GMT

ఎగ్జిట్‌ పోల్స్‌ పై కర్నాటక సీఎం కుమారస్వామి విమర్శలు గుప్పించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్‌ కాదన్నారు. దేశంలో తన హవా ఇంకా కొనసాగుతుందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు వీటిని మోడీ వాడుకున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మోదీ ప్లాన్‌ చేశారని మండిపడ్డారు. కానీ ప్రాంతీయ పార్టీలు మోడీకు మద్దతివ్వవని స్పష్టం చేశారు కుమారస్వామి. 

Similar News