ఎవరో ఒకరితో పొత్తులేకుండా చంద్రబాబు బతకలేరు: కేటీఆర్‌

Update: 2019-02-25 13:25 GMT

దేవరకద్ర కాంగ్రెస్ జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, సర్పంచ్‌లు పలు స్థానిక ప్రతినిధులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. నేడు తెలంగాణ భవన్‌లో పార్టీ చేరిన వారందరికీ గూలాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఢీల్లీని ప్రశ్నించే సత్తా కాంగ్రెస్, బీజేపీ నేతలకు లేదన్నారు. కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వలని అడిగినా కానీ కేంద్రసర్కార్‌కి కొంచెం కూడా చలనం లేదని ఎద్దేవా చేశారు. ఎట్లకైనా కేంద్రసర్కార్ మెడలు వంచి నిధులు తెచ్చే సత్తా కేసీఆర్ కు ఉందన్నారు. ఏపీ ప్రజలే సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రధాని మోదీ, చంద్రబాబు రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారన్నారు. ఇక చంద్రబాబుకి ఎవరో ఒకరితో పొత్తు లేకుండా బ్రతకలేరన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని కేటీఆర్ ఎద్దేవ చేశారు.

Similar News