చూసి అనదించండి.. ఉద్వేగానికి లోను కావొద్దు .. కోహ్లి

Update: 2019-06-16 02:47 GMT

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో అసలుసిసలైన మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు, దాయాదులైన భారత్, పాకిస్థాన్ జట్లు మాంచెస్టర్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్లపైనా ఒత్తిడి తీవ్రంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ కోసం టికెట్లన్నీ ఒక్కటి కూడా మిగలకుండా అమ్ముడుపోగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది టీవీల్లో వీక్షించేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఇరు దేశాల అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇది కేవలం మ్యాచ్ మాత్రమేనని, ఎవరూ ఆవేశానికి లోనుకావద్దని సూచించాడు. చూసి ఆనందించాలే తప్ప, తీవ్ర భావోద్వేగాలకు గురికావద్దని తెలిపాడు. పాక్ తో పోరు నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణంలో ఎలాంటి మార్పులేదని, వరల్డ్ కప్ లో ఆడేందుకు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నామని కోహ్లీ స్పష్టం చేశాడు. 

Tags:    

Similar News