ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కేరళ సీఎం పినరియ విజయన్ కొట్టి పారేశారు. ఎవరెన్ని సర్వేలు చేసినా ఏం చెప్పినా కేరళలో అన్ని పార్లమెంట్ స్థానాలు తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. శబరిమల వివాదం ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. శబరిమల వివాదం ఓ రాజకీయ కుట్రగా పినరియ విజయన్అభివర్ణించారు.