మోహన్ బాబు మునిగిపోయే పడవ ఎక్కారు: బుద్దా వెంకన్న

Update: 2019-03-26 07:46 GMT

కేసీఆర్, జగన్ పై ఏపీ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదు పేడ ఫ్రంట్ అన్నారు. ఫెడరల్ ప్రంట్ లో ఉన్నది కేవలం కేసీఆర్, జగన్ మాత్రమే అన్నారు. ఏపీ ప్రజలను కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి సీఎం కావాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. ఏపీ తో పాటు దేశ విదేశాల్లోని తెలుగువారు జగన్ ను ఛీ కొడుతున్నారన్నారు. జగన్ ను రాష్ర్ట రాజకీయాల నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మోహన్ బాబు మునిగిపోయే పడవ ఎక్కారని ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న.  

Similar News