ఓ వైపు పొలింగ్ తేది దగ్గనపడుటుండంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేఫథ్యంలో వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. వైసీపీలో సినీ గ్లామర్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సినీ నటుడు రాజశేఖర్ దంపతులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. వీరితో పాటు సినీనటి హేమ, యాంకర్ శ్యామల దంపతులతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు వైసీపీలో చేరారు.
ప్రస్తుత దశలో ఏపీకి సంక్షేమ పాలన అందించే శక్తి జగన్కు మాత్రమే ఉందని హీరో రాజశేఖర్ అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న జగన్కు అండగా నిలిచేందుకే వైసీపీలో చేరినట్టు జీవిత తెలిపారు. సినీ నటులు జీవిత, రాజశేఖర్ మళ్లీ వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో జగన్ను కలిసిన జీవిత, రాజశేఖర్ వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలోకి తిరిగి రావడం ఆనందంగా ఉందని చెప్పిన రాజశేఖర్ దంపతులు పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు.