సీపీఐ జనసేనల మధ్య కుదిరిన సయోధ్య...విజయవాడ ఎంపీ సీటు బదులు...

Update: 2019-03-25 05:48 GMT

సీపీఐ జనసేనల మధ్య సయోధ్య కుదిరింది. తమకు కేటాయించిన సీట్లలో జనసేన పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒంటరి పోరుకు సిద్ధమైన సీపీఐ చివరకు వెనక్కు తగ్గింది. విజయవాడ పార్లమెంట్‌ బదులు గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పడంతో శాంతించింది. ఈమేరకు ఇరు పార్టీలు పొత్తు కొనసాగించాలని నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిపిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. జనసేన, సీపీఐ, సీపీఎం, బీఎస్పీల పొత్తు కొనసాగుతుందని పార్టీ నేతలు ప్రకటించారు .

Similar News