పాక్ మళ్లీ కొత్త అబద్దాలు

Update: 2019-03-02 05:01 GMT

పాక్ మరోసారి తమ వక్రబుద్దిని చాటుకుంది, పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై పాక్ కొత్త అబద్దాలు చెబుతోంది. పుల్వామా దాడి వెనుక జైషే మహ్మద్ ఉన్నట్లు ఆధారాలు లేవంటుంది. పుల్వామా ఘటన తమ పనే అని జైషే మహ్మద్ ప్రకటించినప్పటికీ పాక్ మాత్రమే ఘటనతో జైషే మహ్మద్ కు సంబంధం లేదంటూ వెనుకేసుకొస్తుంది. జైషే మహ్మద్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడానని ఉగ్రదాడితో ఎలాంటి సంబంధం లేదంటూ పాక్ విదేశాంగ మంత్రి వెనుకేసుకొచ్చారు. ఉగ్రదాడికి సంబంధించి భారత్ ఆధారాలన్ని సమర్పించింది. అయినప్పటికీ మసూద్ అజార్ కు పూర్తి రక్షణ కల్పిస్తూ పాక్ సైన్యం పటిష్ట భద్రత కల్పిస్తోంది. 

Similar News