ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ

Update: 2019-06-06 14:11 GMT

జూన్‌ 12నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 13న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం ఉండనుంది. అలాగే 13నే స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 14న ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుండగా, అదే రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఇక 14నుంచే శానసమండలి సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన వ్యక్తి శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News