మహబూబ్ నగర్ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య అంతర్గత పోరు మరోసారి బయటపడింది. మహబూబ్ నగర్ పట్టణంలో జిల్లా ప్రింటింగ్ ప్రెస్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రణ కోసం పాత బస్టాండ్ ప్రాంగణంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభించేందుకు ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ను ఆహ్వానించారు. ఎంపీ నిర్ణీత సమయానికి చేరుకున్నాడు. ఎమ్మెల్యే కోసం గంట వెయిట్ చేశాడు. ఎంపీ తిరిగి వెళుతూ ప్రారంభానికి సిద్ధం చేసిన రిబ్బన్ ను తన చేతులతో ప్రారంభించినట్లు మీడియాకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు. ఎంపీ వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వచ్చి రిబ్బన్ కట్ చేసి స్టాల్స్ ప్రారంభించారు.