సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజల కోసం తాను సీఎం కేసీఆర్ను కలుస్తానంటూ ఆయన ప్రకటించారు. తన అవసరం కేసీఆర్కు లేకపోయినా కేసీఆర్ అవసరం తనకు ఉందంటూ అసెంబ్లీ లాబీలో వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పర్యటించేందుకు వస్తే సన్మానం చేస్తానంటూ ప్రకటించిన ఆయన ప్రజా తీర్పును అనుసరించి అనవసర ఆరోపణలు చేయనంటూ తేల్చి చెప్పారు. ఎంతో నమ్మకంతొ తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడటమే తన లక్ష్యమన్నారు.