హెచ్ఎండీఏ కమిషనర్ బి. జనార్దన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను తప్పిస్తూ సోమవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ కమిషనర్గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. జనార్ధన్రెడ్డికి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. విదేశీ పర్యటన నుంచి రాగానే సాధారణ పాలన శాఖకు రిపోర్టు చేయాలని జనార్ధన్రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.