హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్కు ఊరట లభించింది. వైసీపీ నుండి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ అడ్డుకోవాలని చూసిన టీడీపీ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గోరంట్ల మాధవ్ నామినేషన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం స్టే పిటిషన్ను హైకోర్టు నిరాకరించింది. గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవిత నేడు నామినేషన్ దాఖలు చేశారు.