జనసేనాని పవన్ కల్యాణ్ శ్రీకాకుళం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పవన్ ప్రసంగిస్తుండగా వేదికపై మంటలు చెలరేగాయి. దాంతో కొద్దిసేపు అక్కడ అలజడి చెలరేగింది. అయితే పవన్ వేదిక దిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన సభలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగకపోవడంతో పోలీసులు, జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇంజిన్ వేడెక్కడం వల్లే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పొగలు వచ్చినట్లుగా తెలుస్తోంది.