యూపీలోని ఫరుకాబాద్ బీజేపీ ఎంపీ ముకేష్ రాజ్పూత్ చిక్కులో ఇరుక్కున్నారు. అయితే ఫరుకాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిన ముకేశ్. ఎన్నికల్లో భాగంగా ముకేష్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే క్రమంలోనే విద్యుత్శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంది. అయితే ఇక్కడే ముకేశ్ని దెబ్బతిసింది. అయితే గత ఏడు సంవత్సరాలుగా ముకేష్ రాజ్పూత్ కరెంట్ బిల్లులు చెల్లించని కారణంగా బకాయిలు రూ. లక్షల్లో పోగుబడ్డాయి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అడుగగా బిల్లు చెల్లింపులు చేస్తేనే ఇస్తామని చెప్పడంతో సదరు ఎంపీ ఇంజినీర్కు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు గురిచేశాడు. అయితే తను బెదిరించిన ఆడియో టేపు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో దూమ్మరేపుతోంది. ఎంపీ బెదిరింపులపై ఇంజినీర్ తన పైఅధికారులకు ఫిర్యాదు చేశాడు.