కేంద్ర ఎన్నికల సంఘానికి పసుపు రైతులు వినతిపత్రం

Update: 2019-05-03 08:43 GMT

రైతు సమస్యలను దేశవ్యాప్తంగా తెలియజేసేందుకు ప్రయత్నించిన తమకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయని నిజామాబాద్‌కు చెందిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారణాసి బరిలో తాము వేసిన నామినేషన్లను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రైతులు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కూడా ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చని కేవలం పసుపు బోర్డు కోసమే ప్రధాని మోడీపై పోటీకి నామినేషన్లు వేశామని వివరించారు. ఇంటలీజెన్స్ పోలీసులు, బీజేపీ నేతలు తమను వేధించారని అన్ని విషయాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర ఎన్కికల సంఘానికి అందజేశామని తెలిపారు. 

Similar News