జగన్ కి ఈటెల రాజేందర్ లేఖ ..

Update: 2019-06-15 15:08 GMT

తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఏపి సీఎం జగన్ కి ఓ లేఖ రాసారు .. అందులో మంత్రి ఈటెల హుజూరాబాద్ కు చెందిన దొంత రమేశ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని లేఖలో కోరారు.రమేష్ గత 18 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారని ఈటల తన లేఖలో తెలిపారు. అయితే మొదటి నుండి తెలంగాణా నుండి ఒక బోర్డు మెంబెర్ ని కేటాయించటం అనేది ఓ ఆనవాయితీగా వస్తోంది. అందువల్ల రమేష్ పేరును సూచించారు . గతంలో టీటీడీ బోర్డులో తెలంగాణకు చెందిన కొందరు టీడీపీ నేతలకు కూడా చోటు కల్పించారు చంద్రబాబు. మరి టీటీడీ కొత్త బోర్డులో తెలంగాణ వారికి జగన్ ప్రాతినిధ్యం కల్పిస్తారో లేదో చూడాలి. 

Tags:    

Similar News