సార్వత్రిక ఎన్నికల ముందు మాయావతికి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ అధినేత్రి మాయావతికి సంబంధించిన ఆస్తులపై ఈడీ దాడులు చేసింది. స్మారక కట్టడాల అక్రమాల కేసులో లక్నోలోని 7 ప్రాంతాల్లో ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాయవతి హయాంలో 14వందల కోట్ల అక్రమాలు జరిగినట్టు గతంలో లోకాయుక్త గుర్తించింది. స్మారక స్కామ్లో దోషులు ఎవరూ తప్పించుకోవడానికి వీలులేదని 2018 సెప్టెంబర్లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. 2007 - 2011 మధ్య కాలంలో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.