ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వారణాసి బరిలో నిలిచిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్కు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. వారణాసిలో ప్రధాని మోడీపై పోటికి దిగిన మాజీ జవాన్, ఎస్పీ అభ్యర్థి తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అధికారులు అడిగిన డాక్యుమెంట్స్ గడువులోగా ఇవ్వకపోవడంతో తేజ్ బహదరూర్ యాదవ్ నామినేషన్ తిరస్కరించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఈసీ ఆదేశించినట్టే సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అన్యాయంగా తన నామినేషన్ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిందని యాదవ్ ఆరోపించారు. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు.