జమ్మూ కశ్మీర్‌లో ఈ ఏడాదే ఎన్నికలు

Update: 2019-06-05 04:00 GMT

కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన తర్వాత కశ్మీర్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. అమర్‌నాథ్‌ యాత్ర వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అంటే ఈ ఏడాదిలోనే కశ్మీర్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 19న రాష్ట్రపతి పాలన కశ్మీర్‌ లో గడువు ముగుస్తుండగా, దాన్ని పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది.  

Tags:    

Similar News