కాంగ్రెస్లో చేరిన బీజేపీ ఎంపీదేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతాపార్టీకి (బీజేపీ)కి భారీ షాక్ తగిలింది. బీజేపీ తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఉదిత్ రాజ్ను పక్కనపెట్టిన బీజేపీ వాయువ్య ఢిల్లీలో పంజాబీ సూఫీ సింగర్ హన్స్ రాజ్ హన్స్ను ఎన్నికల బరిలో దింపింది. దీంతో ఉదిత్ రాజ్ బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో నేడు (బుధవారం) ఉదిత్ రాజ్ కాషాయం వీడీ కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు.
అయితే ఈ సందర్భంగా ఉదిత్ రాజ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు నీరుగార్చడాన్ని వ్యతిరేకించినందుకే తనకు బీజేపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించిందని అన్నారు. ఐఆర్ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్ గత2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. కాగా 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అదే ఏడాది వాయువ్య ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి భారీ విజయం సాధించారు.