శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భాగంగా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 26లక్షల విలువైన కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రిల్లింగ్ మిషన్ కుక్కర్లో బంగారు కడ్డీలు అమర్చుకుని తీసుకురావడాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.